ఒంగోలులో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారంపై పోలీసులు దాడులు నిర్వహించారు.
బాలాజీరావుపేటలోని ఓ డాబాలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో,
పోలీసులు తనిఖీలు చేసి ఒక విటుడుతో పాటు ఇద్దరు మహిళలను గుర్తించారు.
వీరిని రిమాండ్ కు తరలిస్తామని, చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.

